యాప్నగరం

3 రాజధానులపై భగ్గుమన్న అమరావతి రైతులు, టీడీపీ.. ఆందోళనలు తీవ్రతరం

ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంపై అమరావతి రైతులు, టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.

Samayam Telugu 1 Aug 2020, 2:52 pm
ఏపీ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపడంపై అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. తుళ్లూరులో రైతులు ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తామని.. న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామంటున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.
Samayam Telugu అమరావతి ఆందోళనలు


అమరావతి రైతులు మాత్రమే కాదు.. మూడు రాజధానులు వద్దంటూ ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ, సీపీఎం పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలు టీడీపీ ఆఫీసు దగ్గర ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. లేకపోతే కర్నూలును రాజధానిని చేయాలన్నారు. ఇటు పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా టీడీపీ ఆందోళనలు చేపట్టింది.. అమరావతి రైతులకు మద్దతు తెలిపింది.

అమరావతి రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ విజయవాడలో సీపీఎం నిరసనకు దిగారు. బీ. ఆర్.టీ.ఎస్ రోడ్‌లో రాజధానిని వికేంద్రీకరణపై సీపీఎం ధర్నాకు దిగింది. గత అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించాయన్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు సీఎం జగన్ మాట మార్చడం జనాన్ని మోసం చేయడమే అన్నారు. ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే కొనసాగిస్తామని ప్రజలకు మాట ఇచ్చారని.. మడమ తిప్పారని మండిపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడం సరికాదన్నారు. రాజధాని సమస్య కేవలం అమరావతి రైతులది కాదని.. రాష్ట్ర ప్రజలందరిదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.