యాప్నగరం

YSRCP ఎమ్మెల్యేకు అమరావతి రైతుల సెగ.. ఆయన ఇంటికెళ్లి మరీ..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు అమారవతి రైతుల నిరసన సెగ. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నిరసన తెలియజేసిన రైతులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్.

Samayam Telugu 27 Dec 2019, 8:31 am
అమరావతి రైతులు ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నారు. అమరావతి ప్రాంత, కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమైనా.. జగన్ నిర్ణయంవైపే మొగ్గు చూపడంతో భగ్గుమన్నారు. ఆగ్రహంతో ఎమ్మెల్యేలపై నిరసన ప్రకటించారు.. రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంటికి వెళ్లారు. బయట గోడకు వినతిపత్రం అంటించి వినూత్నంగా నిరసన తెలియజేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి అని కోరుతూ ఆ వినతిపత్రాన్ని అంటించారు.
Samayam Telugu rk


Read Also: ఏపీ రాజధానిపై నేడే నిర్ణయం.. అటు వైపే మొగ్గు?

అంతేకాదు ఎమ్మెల్యే ఆర్కేపై మూడు రోజుల క్రితం అమరావతి రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ సమస్యల్ని చెప్పుకుందామంటే ఆర్కే కనిపించడం లేదని.. ఆయన్ను వెతికి పెట్టాలని కోరారు. అంతేకాదు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపైనా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కూడా కనిపించడం లేదని.. వెతకమని వినతిపత్రం అందజేశారు.. దీంతో ఆర్కే స్పందించారు.

మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉంటానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజధాని రైతులకు ఎట్టి పరస్థితుల్లో అన్యాయం జరగదని.. ముఖ్యమంత్రి జగన్ వారిని ఆదుకుంటారని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను కనిపించడం లేదని కొందరు రైతులు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని.. ఈ అంశంపై తాను తర్వాత స్పందిస్తానని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.