యాప్నగరం

అమరావతి రైతుల వినూత్న నిరసన.. మోకాళ్లపై నిలబడి హైకోర్టు జడ్జిల్ని వేడుకుంటూ!

హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమూర్తులకు దండం పెడుతూ వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలబడ్డారు.

Samayam Telugu 4 Aug 2020, 11:56 am
మూడు రాజధానులపై అమరావతి రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలిపిన రోజు నుంచి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమూర్తులకు దండం పెడుతూ వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలబడ్డారు. మోకాళ్లపై నిలబడి న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటకపాలెం, మందాడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయపాలెం గ్రామస్తులు రోడ్డుపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు.
Samayam Telugu అమరావతి రైతులు


తమ ఆశ మొత్తం హైకోర్టుపైనే ఉందని రైతులు అంటున్నారు. అమరావతిని న్యాయస్థానాలే కాపాడగలవని.. త్యాగాలు చేసిన రైతులను ప్రభుత్వం రోడ్డుపై నిలుచోబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలే దేవస్థానాలుగా భావించి న్యాయమూర్తులను వేడుకుంటున్నామన్నారు. అంతేకాదు సోమవారం రోజు శిబిరాల్లో హైకోర్టుకు తుళ్ళూరు మహిళ రైతులు ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టుకు నమస్కారం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.