యాప్నగరం

వైసీపీ అంతు చూస్తాం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

అమరావతిని నాశనం చేస్తే వైసీపీ అంతు చూస్తామని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రావెల కిశోర్ బాబు వ్యాఖ్యానించారు. రాజధాని అంగుళం కూడా కదలబోదని ఆయన చెప్పారు.

Samayam Telugu 2 Feb 2020, 2:34 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలనుకున్నారని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రావెల కిశోర్‌బాబు విమర్శించారు. రాజధాని కోసం మందడంలో ఆందోళన చేస్తున్న రైతులకు బీజేపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. అయితే రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ రకంగా.. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మరో రకంగా మాట్లాడుతున్నారని రాజధాని రైతులు ఆక్షేపించారు. రాజధానిపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని మహిళా రైతులు డిమాండ్ చేశారు.
Samayam Telugu ysrcp, bjp

ఈ సందర్భంగా రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని నాశనం చేస్తే బీజేపీ, జనసేన పార్టీలు కలిసి వైసీపీ అంతు చూస్తాయని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ రాష్ట్రానికి పట్టిన శనిలా తయారయ్యారని మండిపడ్డారు. రాజధాని ప్రాంత ప్రజలు రోడ్డెక్కితే జగన్‌కు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఇది రైతుల సమస్య కాదని, 5 కోట్ల మంది ప్రజల సమస్యని అన్నారు.

అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని రావెల వ్యాఖ్యానించారు. అమరావతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారన్న విషయాన్ని మర్చిపోవద్దని వైసీపీ ప్రభుత్వాన్ని రావెల కిశోర్‌బాబు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.