యాప్నగరం

ప.గో జిల్లాకు చేరిన పాదయాత్ర.. మంత్రి బొత్సపై అమరావతి రైతుల ఫైర్!

అమరావతి రైతుల పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరింది. అయితే, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 26 Sep 2022, 12:27 am
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ నేతలు మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పాలకులు.. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Samayam Telugu పశ్చిమ గోదావరి జిల్లాకు చేరిన పాదయాత్ర


మరోవైపు రాజధాని రైతుల మహా పాదయాత్ర 14వ రోజు కొనసాగింది. ఆదివారం పాదయాత్ర ఎన్టీఆర్‌ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా అమరావతి రైతులకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. మూడు రాజధానుల పేరిట నాటకాలు ఆడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటలు కట్టిపెట్టి.. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఇక, గుడివాడలో శనివారం ఉద్రిక్తతల మధ్య జరిగిన యాత్ర.. ఆదివారం నాగవరప్పాడు నుంచి ప్రారంభమైంది. టీడీపీ సీనియర్‌ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, రావి వెంకటేశ్వరరావు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జై అమరావతి’ అంటూ రైతులు, స్థానిక ప్రజలు నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని డిమాండ్ చేశారు. జగన్నాథపురం, నందివాడ గ్రామాల ప్రజలు అమరావతి రైతుల స్వామివారి రథానికి గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలు కొట్టి సాదరంగా ఆహ్వానించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.