యాప్నగరం

వైసీపీ ఎంపీకి అమరావతి మహిళా రైతుల సన్మానం

ఢిల్లీ వెళ్లిన జేఏసీ నేతలు అమరావతికి మద్దతు తెలిపినందుకు ఎంపీని కలిసి ధన్యవాదాలు తెలిపి ఘనంగా శాలువాతో సన్మానించారు. అమరావతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 21 Sep 2020, 11:52 am
వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అమరావతి మహిళ జేఏసీ ప్రశంసలు కురిపించింది. ఢిల్లీ వెళ్లిన జేఏసీ నేతలు అమరావతికి మద్దతు తెలిపినందుకు ఎంపీ రఘురామను కలిసి ధన్యవాదాలు తెలిపి ఘనంగా శాలువాతో సన్మానించారు. రాజధాని ఉద్యమ కార్యాచరణతో పాటూ తాజా పరిణామాలు, పలు కీలక అంశాలపై ఎంపీతో చర్చించారు.
Samayam Telugu ఎంపీ రఘురామ


అమరావతి మహిళా జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజధాని మారకుండా చూడాలంటూ అన్ని పార్టీల పెద్దలకు విన్నవించేందుకు దేశ రాజధానికి వెళ్లారు. రాజధాని రైతుల కష్టాలను నేతలకు తెలియజేస్తామని.. అమరావతి ఒక ప్రాంతానికి చెందినది కాదని.. ఐదుకోట్ల ప్రజల సమస్య అనే విషయాన్ని నేతలకు వివరిస్తామన్నారు. ఈ అంశంపై ఆయా పార్టీల నేతలకు వినతిపత్రాలు అందజేస్తామని మహిళ జేఏసీ నేతలు తెలిపారు. అమరావతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లేముందు జై అమరావతి, ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ మహిళా నేతలు నినాదాలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.