యాప్నగరం

వైసీపీ కార్యకర్తపై అమరావతి మహిళా రైతుల దాడి

మూడు రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తుళ్ళూరు దీక్షా శిబిరాన్ని సందర్శించిన సమయంలో లోకేష్‌తో ఓ మహిళా రైతు తన కష్టాన్ని చెప్పుకుంది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసభ్యకరంగా కామెంట్స్ చేశారని ఆరోపణలు.

Samayam Telugu 16 Oct 2020, 8:32 am
గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అమరావతి మహిళా రైతుల చితక్కొట్టారు. సోషల్ మీడియాలో అమరావతి మహిళా రైతుల పట్ల అసభ్యకరంగా కామెంట్ పెట్టినందుకు తుళ్ళూరుకు చెందిన గద్దె రాకేష్‌పై మహిళా రైతులు దాడి చేశారు. అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్భంగా.. మూడు రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తుళ్ళూరు దీక్షా శిబిరాన్ని సందర్శించిన సమయంలో లోకేష్‌తో ఓ మహిళా రైతు తన కష్టాన్ని చెప్పుకుంది.
Samayam Telugu అమరావతి

తన భర్త చనిపోయి మూడేళ్ల నుంచి తాను పగలు దీక్షా శిబిరంలో కూర్చుని రాత్రి పూట మిషన్ కొట్టుకుంటూ పిల్లల్ని పోషిస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత కొన్ని పత్రికల్లో ప్రచురించిన వార్తను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి.. రాజధాని రైతులపై అసభ్య కరంగా కామెంట్ చేసినట్లు మహిళా రైతులు చెబుతున్నారు. అతడి వివరాల గురించి ఆరా తీసిన అమరావతి మహిళా రైతులు నేరుగా అతడి ఇంటికి వెళ్లారు. అతడిపై దాడికి దిగారు.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.. మహిళల్ని అక్కడి నుంచి పంపించారు.

ఈ విషయంపై రాజధాని రైతులు రాకేష్‌ చౌదరిపై చర్యలు తీసుకోవాలని తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను అభ్యంతరకరంగా పోస్టింగ్‌ పెట్టలేదని, రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా అంటూ దుర్భాషలాడుతూ తనను కొట్టారంటూ రాకేష్‌ చౌదరి కూడా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.