యాప్నగరం

ఏపీలో ప్రమాదం.. కాలువలో అంబులెన్స్ బోల్తా

ప్రమాదం జరిగిందని సమాచారం రాగానే.. వారిని కాపాడేందుకు అంబులెన్స్ వెళ్తోంది. ఈలోగ అదుపుతప్పి వరదకాలవలో పడిపోయింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

Samayam Telugu 12 Aug 2020, 10:13 am
ప్రమాదం సమయంలో అండగా నిలిచి గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌కు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం జలంత్ర కోట జంక్షన్ వద్ద జాతీయరహదారిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. లారీని అధికమించే క్రమంలో అడుపుతప్పిన అంబులెన్స్ బోల్తా పడి పక్కనే ఉన్న వరద కాలువలో పడిపోయింది.
Samayam Telugu ఏపీలో అంబులెన్స్ బోల్తా
ambulance accident


అయితే ఆ సమయంలో డ్రైవర్ మినహా ఎవ్వరూ అంబులెన్స్‌లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నపాటి గాయాలతో బయటపడ్డ డ్రైవర్ ను గమనించిన కొందరు స్థానికులు మెరుగైన చికిత్స కోసం బరంపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారిని రక్షించడానికి వెళ్తుండగా అంబులెన్స్ కూడా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో ఇటీవలే సీఎం జగన్ అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్‌ వాహనాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Read More: తిరుపతి: తల్లిని నడిరోడ్డుపై వదిలేసిన కొడుకు
ఆధునిక వసతులతో కూడిన 108, 104 వాహనాల్ని ఏపీ ప్రభుత్వం అందుబాటులో తీసుకువచ్చింది. మొత్తం 1088 అంబులెన్సులు ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు అత్యాధునిక కోవిడ్ 19 బస్సులు ఇప్పటికే రాష్ట్రంలో సేవలందిస్తున్నాయి. 2 వందల కోట్ల రూపాయలతో కొత్తగా కొనుగోలు చేసిన 108, 104 వాహనాలు రాష్ట్రంలోని 676 మండలాల్లో అందుబాటులో వచ్చాయి. అర్బన్ పరిధిలో 15 నిమిషాల్లోనూ, రూరల్ పరిధిలో 20 నిమిషాల్లోనూ, ఏజెన్సీ పరిధిలో 25 నిమిషాల్లోనూ 108 వాహనం చేరుకునేలా టైమ్ మేనేజ్ మెంట్ వ్యవస్థను సైతం అధికారులు ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.