యాప్నగరం

అమరావతిలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నినాదాలు

అమరావతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నినాదాలు.. ప్లీజ్ ట్రంప్.. సేవ్ అమరావతి అంటూ రైతులు, మహిళల నినాదాలు. ట్రంప్‌కు తమ బాధను చెప్పుకున్నామన్న రాజధాని ప్రాంత రైతులు.

Samayam Telugu 25 Feb 2020, 4:38 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ట్రంప్ పర్యటన ముగియనుంది.. ఢిల్లీ నుంచి ఆయను అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు. ఇదిలా ఉంటే ట్రంప్ టూర్ ఎఫెక్ట్ రాజధాని అమరావతిపై పడింది. అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు వినూత్నంగా నిరసనను తెలియజేశారు. మంగళవారం ట్రంప్ ఫోటోలతో నిరసనలు తెలియజేశారు.

రైతులు, మహిళలు ట్రంఫ్ ప్లకార్డులతో ప్లీజ్ ట్రంప్.. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధానిని మార్చకుండా చూడాలని కోరారు. అమెరికాకు ఒకటే రాజధాని ఉందని రైతులు, మహిళలు గుర్తు చేశారు. ఇక్కడ సీఎం జగన్ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఈ నిరసన ద్వారా ట్రంప్‌కు తమ ఆవేదనను చెప్పుకుంటున్నాము అంటున్నారు రైతులు.

అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనలు 70వ రోజుకు చేరాయి. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రాయపూడి, నేలపాడు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం, తాడికొండలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటు మందడంలో రైతుల శిబిరాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. ముఖ్యమంత్రి జగన్ సెక్రటేరియట్‌కు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.