యాప్నగరం

అనంతపురంలో ఘోరం: యాక్సిడెంట్ మృతుడిని చూస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే ఐదుగురు!

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు.

Samayam Telugu 18 Dec 2020, 10:40 pm
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బత్తలపల్లి మండలం రాఘవంపల్లె వద్ద కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. తొలుత బైక్‌ను ఓ కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే ఘటనా స్థలంలో ఉన్న వారిపైకి లారీ దూసుకురావడంతో మరో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Samayam Telugu అనంతపురం రోడ్డు ప్రమాదం


తొలుత కారు బైక్‌ను ఢీకొనడంతో రాజశేఖర్ అనే యువకుడు దుర్మరణం చెందారు. ఘటనస్థలిని పరిశీలిస్తున్న వారిపై మరో లారీ దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. మృతులను రాజశేఖర్, శ్రీనివాస్, శివమ్మలుగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను బత్తలపల్లి ఆసుపత్రికి తరలించారు. ఒకే సారి ఐదుగురు దుర్మరణం చెందడంతో రాఘవంపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.