ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజు, రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. స్థానిక పరిస్థితుల్ని బట్ట పలు నగరాలు, పట్టణాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఆదివారం కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక ఈ కరోనా ముప్పు పోలీసులు, వైద్య సిబ్బందితో పాటూ ప్రజా ప్రతినిధుల్ని వెంటాడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకోగా.. మరికొందరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనాబారిన పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటివ్ తేలింది.. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్ట్లు చేయించుకోగా.. వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. కుటుంబసభ్యులతో పాటూ సన్నిహితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరణం బలరాంలు కరోనా బారినపడ్డారు. తాజాగా అనపర్తి ఎమ్మెల్యే కూడా.
తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనాబారిన పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటివ్ తేలింది.. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్ట్లు చేయించుకోగా.. వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. కుటుంబసభ్యులతో పాటూ సన్నిహితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరణం బలరాంలు కరోనా బారినపడ్డారు. తాజాగా అనపర్తి ఎమ్మెల్యే కూడా.