యాప్నగరం

బాలయ్య చిన్నల్లుడు, చిన్నకూతురి ఆస్తులు వేలానికి..?

Nanadamuri Balakrishna చిన్నల్లుడు, చిన్నకూతురి ఆస్తులను వేలం వేస్తామని ఆంధ్రా బ్యాంకు ప్రకటన ఇచ్చింది. న్యూస్ పేపర్లలో ఈ మేరకు ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Samayam Telugu 17 Oct 2019, 6:45 pm
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, చిన్న అల్లుడు శ్రీ భరత్ మతుకుమిల్లి ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వేయనుందా? విశాఖ ఎంపీగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13 కోట్లకుపైగా బకాయి పడిందని తెలుస్తోంది. దీంతో ఆస్తుల వేలానికి ఆంధ్రా బ్యాంకు ప్రకటన ఇచ్చింది. మెస్సర్ వి.బి.సి రెన్యువేబిల్ ఎనర్జీ సంస్థతోపాటు.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని, అల్లుడు శ్రీ భరత్‌, వంకిన రమేశ్ చంద్ర చౌదరి, జాస్తి రామకృష్ణ చౌదరి, బిశ్వజిత్ మిశ్రా తదితరుల పేర్లను ఆంధ్రా బ్యాంక్ ఈ ప్రకటనలో పేర్కొంది.
Samayam Telugu balaiah and sri bharat


ఒప్పందం ప్రకారం రూ.13 కోట్ల 65 లక్షల 69 వేలకు పైగా ఉన్న బకాయిలను నోటీసులు అందిన 60 రోజుల్లోగా బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని విశాఖ సీతమ్మధారలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ రుణ గ్రహీతలకు సూచించింది.

ఈ రుణం తీసుకోవడానికి మెస్సర్స్ సంస్థ పేరిట విజయనగరం, విశాఖపట్నంలలో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టారని.. నిర్ణీత కాల వ్యవధిలోగా తనఖా పెట్టిన ఆస్తులను విడిపించుకోవాలని రుణ గ్రహీతలకు బ్యాంకు సూచించింది.

బాలయ్య చిన్నల్లుడి కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారని విజయసాయి ఆరోపించారు.

Read Also: కేసీఆర్‌ను ఇరుకునపెట్టేలా జగన్ మరో నిర్ణయం?

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నిక‌ల్లో భరత్ టీడీపీ త‌ర‌పున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌ువడైన భ‌ర‌త్‌ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈ రుణం తీసుకున్నారని తెలుస్తోంది.

Read Also: లోగో డిజైన్ చేయండి.. రూ. 50 వేలు గెలవండి.. జగన్ సర్కారు ఆఫర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.