యాప్నగరం

హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. అరగంట పాటు చర్చలు

సీఎం వైఎస్ జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

Samayam Telugu 14 Feb 2020, 10:43 pm
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు అర గంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Samayam Telugu amit


ఇవే అంశాలపై రెండు రోజుల కిందటే సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. శుక్రవారం (ఫిబ్రవరి 14) సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.