యాప్నగరం

ఏపీలో రాత్రి కర్ఫ్యూ వాయిదా, మాస్క్ లేకపోతే రూ. 100 ఫైన్.. కొత్త రూల్స్ ఇవే!

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూకు సంబంధించి జగన్ సర్కారు ఉత్తర్వులను సవరించింది. కర్ఫ్యూను వాయిదా వేస్తూ ప్రకటన!

Samayam Telugu 11 Jan 2022, 4:59 pm
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూను జగన్ ప్రభుత్వం వాయిదా వేసింది. సంక్రాంతి పండుగ తర్వాత.. ఈ నెల 18వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం కర్ఫ్యూపై తొలుత ఉత్తర్వులు ఇచ్చిన జగన్ సర్కారు.. కొన్ని గంటల్లోనే సవరణ చేస్తూ, తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Samayam Telugu ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా


సంక్రాంతి పండుగ వేళ పల్లెలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఒకవేళ ఎవరైనా మాస్కులు ధరించకపోతే రూ. 100 జరిమానా విధిస్తామని వెల్లడించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే, వాణిజ్య దుకాణాలు, మాల్స్‌ తదితర వాటిల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.