యాప్నగరం

జగన్‌కు మోదీ అవార్డ్.. న్యూ ఇయర్ సందర్భంగా అందివ్వనున్న ప్రధాని

ఏపీకి ఆ పథకం అమలులో మూడో ర్యాంక్ దక్కింది. జనవరిలో కొత్త సంవత్సరం సందర్భంగా మోదీ ఈ అవార్డును సీఎం జగన్‌కు అందివ్వనున్నారు.

Samayam Telugu 27 Dec 2020, 9:44 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అవార్డు అందివ్వనున్నారు. న్యూఇయర్ సందర్భంగా ఆయన ఈ అవార్డు ఇవ్వనున్నారు. వర్చువల్ మీటింగ్ ద్వారా సీఎం జగన్‌కు ప్రధాని మోదీ అవార్డు ప్రధానం చేయనున్నారు. ప్రధాని మంత్రి అవాస్ యోజన పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంక్ దక్కింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధాని మోదీ ఈ అవార్డు ప్రధానం చేయనున్నట్లు సమాచారం.
Samayam Telugu జగన్‌కు మోదీ అవార్డు


Read More: ఏపీని వణికిస్తోన్న కరోనా స్ట్రెయిన్: యూకే నుంచి ఓ మహిళకు..!

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను పూర్తి చేసేందుకు కేంద్రం అందించే అద్భుతమైన వరం. ఈ పథకం కింద గృహ కొనుగోలుదారులకు గృహ రుణంపై 2.67 లక్షల రూపాయల ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్రయోజనం గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి సబ్సిడీ రూపంలో వస్తుంది.ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి, పెద్ద సంఖ్యలో గృహ కొనుగోలుదారులు ఈ పథకం ద్వారా లక్షల రూపాయల లాభం పొందారు. 2022 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పిఎం ఆవాస్ యోజన(Pradhan Mantri Awas Yojana)ను ప్రారంభించారు.

ఇటీవలే ఏపీలో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది ప్రభుత్వం. క్రిస్మస్ సందర్భంగా జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో కులమతాలకు సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం 66,518 ఎకరాలు సేకరించామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.