యాప్నగరం

వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే!

Question Paper Fight Between YSRCP and Janasena: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఏపీ పాలిటిక్స్ వేడెక్కాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైసీపీ, జనసేన క్వశ్చన్ పేపర్ల రూపంలో విమర్శలు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ 12వ తరగతి ఫెయిల్ అంటూ వైసీపీ క్వశ్చన్ పేపర్ ట్వీట్ చేయగా.. బదులుగా జనసేన జగన్ పేరుతో మరో ప్రశ్నాపత్రం రిలీజ్ చేసింది. రెండు పార్టీలు ఈ క్వశ్చన్ పేపర్లలో ప్రశ్నల రూపంలో సెటైర్లు సంధించుకోగా.. ప్రస్తుతం ఈ క్వశ్చన్ పేపర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Authored byవంకం వెంకటరమణ | Samayam Telugu 19 Apr 2024, 10:05 pm
Question Paper Fight Between YSRCP and Janasena: రాజకీయ పార్టీలు అప్ డేట్ అయ్యాయి. ఒకప్పటిలా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మాత్రమే నమ్ముకోవడం లేదు. సోషల్ మీడియాలోనూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక ట్రెండ్‌కు తగినట్లుగా ఎప్పటికప్పుడు తమ ప్లాన్ మారుస్తూ ముందుకెళ్తున్నాయి ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ ఫైటింగ్ జరుగుతోంది. వైసీపీ, జనసేన క్వశ్చన్ పేపర్ల రూపంలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక వార్‌ను వైఎస్సార్‌సీపీ మొదలెట్టగా.. జనసేన దానికి కౌంటర్లు వేస్తోంది.
Samayam Telugu Question Paper Fight Between YSRCP and Janasena
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే!


జనసేనాని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వైసీపీ తొలుత ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ 12వ తరగతి ఫెయిల్ అంటూ ఎక్స్‌లో ఒక క్వశ్చన్ పేపర్ షేర్ చేసింది. పేరు పవన్ కళ్యాణ్, తరగతి 12 ఫెయిల్, రోల్ నంబర్ 03 అని అందులో పేర్కొంది. క్వశ్చన్ పేపర్‌లో ఎందుకు రాజకీయాల్లో ఉన్నావ్? ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావ్? నీ రాజకీయ వ్యూహకర్త ఎవరు? నీకు ఇష్టమైనది ఏమిటి? చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిశావ్? మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. నాలుగోది ఎప్పుడు? అని వైసీపీ ప్రశ్నలు వేసింది.

మరోవైపు.. వైసీపీ క్వశ్చన్ పేపర్‌కు కౌంటర్‌గా జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పేరుతో జనసేన ప్రశ్నాపత్రం రిలీజ్ చేసింది. దీనిని వైసీపీ ట్వీట్‌కి రిప్లైగా ఇచ్చింది.


పేరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తరగతి ఫస్ట్ క్లాస్, రోల్ నంబర్ 420 అంటూ అందులో రాసుకొచ్చింది. రాజకీయ వారసత్వం లేకుంటే జగన్ ఏం చేసేవాడు? కేసుల కోసం ఢిల్లీలో ఎన్నిసార్లు తలవంచాడు? భారీ మెజారిటీ సాధించిన వైసీపీని ఓటమి దిశగా నడిపిందేవరు? ఖరీదైన దోపిడీ ఏది? ఎగ్గొట్టిన హామీ ఏది? ఓడిపోయాక జగన్ ఏం చేస్తారు? అని ప్రశ్నలతో సెటర్లు వేసింది. ప్రస్తుతం ఈ రెండు క్వశ్చన్ పేపర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రచయిత గురించి
వంకం వెంకటరమణ
వంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.