యాప్నగరం

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అందరి చూపు సీఎం జగన్ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌‌పైనే!

Andhra Pradesh Assembly Session నేటి నుంచి ప్రారంభంకానుంది. మరోసారి తెరపైకి వచ్చిన మూడు రాజధానులు. తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందని చెబుతున్నారు. ఈసారి సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును కూడా ప్రవేశపెడతారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇవాళ బీఏసీ సమావేశం.. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో చర్చించనున్నారు. అసెంబ్లీలో మొత్తం 25 అంశాలపై చర్చించారలని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 Sep 2022, 6:05 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AP Assembly Sessions
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్నిరోజులు, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. తొలిరోజు శాసనసభలో పరిపాలనా వికేంద్రీకరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేయనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు మూడు రాజధానుల అంశంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తారని చెబుతున్నారు. దీనిపై ఆయన రాజకీయంగా కీలక ప్రకటననూ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 25 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

సభలో దివంగత సభ్యులకు సంతాపాన్ని తెలియజేయనున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శత్రుచర్ల చంద్రశేఖరరాజు, పులవర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్‌, నల్లమిల్లి మూలారెడ్డిల మృతిపై సభలో సంతాపతీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం ప్రవేశపెడతారు. ఈసారి సమావేశాల్లో రెవెన్యూశాఖ 4 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 3 బిల్లులు చట్ట సవరణకు, ఒక బిల్లు రద్దుకు సంబంధించినవి. ‘ఆటో మ్యుటేషన్‌’ విధానానికి అనుగుణంగా రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్‌-1971 చట్టాన్ని సవరిస్తారు.

భూముల రీ-సర్వే అనంతరం యజమానులకు శాశ్వత భూ యాజమాన్య హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన టైటిలింగ్‌ యాక్టు సవరణ తీసుకురాబోతున్నారు. ఈ బిల్లును మూడోసారి సభలో పెడుతున్నారు. దీనికి చట్టసభల్లో ఆమోదం తెలిపిన తర్వాత ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపనున్నారు. 1956 నాటి కౌలు చట్టాన్ని రద్దు చేసే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఇనామ్స్‌ అబాలిషన్‌ చట్టానికి (1956) సవరణ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.