యాప్నగరం

వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కేబినెట్ భేటీ తర్వాత!

కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను నవంబరు 2 లోపు సమర్పించాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 30 Oct 2020, 9:00 am
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెషన్స్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. నవంబరు 15 తర్వాత వారం రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నవంబరు 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి భేటీకానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu ఏపీ అసెంబ్లీ


అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి.. ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై మంత్రిమండలి భేటీ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను నవంబరు 2 లోపు సమర్పించాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు నవంబర్‌లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.