యాప్నగరం

జగన్ సర్కార్‌ కీలక నిర్ణయం.. బీజేపీ మైండ్ గేమ్!

జగన్ సర్కార్‌ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న బీజేపీ. జగర్ రియల్ ఎజెంటా ఏంటో చెప్పాలంటూ కొత్త నినాద. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్‌సీపీ దుర్వినియోగ పరుస్తోందని ఫైర్.

Samayam Telugu 4 Sep 2019, 9:46 pm
ఏపీలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై బీజేపీ మండిపడుతోంది.. ఆ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఆంధప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ స్పందించారు. సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu jagan.


సునీల్ దేవధర్ తన ట్వీట్‌లో ‘పాస్టర్లకు గౌరవ వేతనానికి సంబంధించి ప్రభుత్వ నిధులు వెచ్చించి సర్వే చేయడమా.. ఒకే మతానికి అనుకూలంగా ప్రభుత్వ విధానాలున్నాయి. వైసీపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి.. అన్ని మతాల్లోనూ పేదలు ఉన్నారు వారందర్ని మర్చిపోయారా. పాస్టర్లకే ఎలా వేతనం ఇస్తారు.. జగన్ రియల్ ఎజెండా ఏంటో చెప్పాలి’అన్నారు.
ఇటు ఈ వివాదంపై ఏపీ బీజేపీ కూడా ట్వీట్ చేసింది. జగన్ ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనానికి సంబంధించిన లబ్దిథారుల్ని గుర్తించేందుకు.. గ్రామ వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఇలాంటి మతపరమైన నిర్ణయాలు సరికాదంటోంది.. ఈ సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే మతపరమైన నిర్ణయాల్లో జగన్ సర్కార్‌‌ను ఇరుకున పెట్టే పనిలో ఉంది బీజేపీ. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతోంది. జగన్ అమెరికా పర్యటనలో జ్యోతి ప్రజ్వలన చేయకపోవడంపై.. తిరుమలకు వెళ్లే బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరుగుతోందన్న వ్యవహారం.. తాజాగా పాస్టర్లకు జీతాలు ఇవ్వాలన్న నిర్ణయంపై స్పందించింది. జగన్ సర్కారును ఇరుకున పడేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న వైఎస్సార్‌సీపీ మైండ్ గేమ్‌లా కనిపిస్తోందనే చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.