ఏపీ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓకే చెప్పారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కన్నబాబు సమర్పిస్తారు. శాసనమండలిలో సభా నాయకుడు, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.
రాష్ట్ర బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం
సోమవారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓకే చెప్పారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు.
Samayam Telugu 16 Jun 2020, 10:01 am