యాప్నగరం

కాపులకు జగన్ సర్కార్ శుభవార్త.. రూ.15వేలు సాయం.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయం

Kapu Nestam| అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు. కాపుల కోసం కొత్త పథకం.. ఏడాదికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయం. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య కూడా పెంపు.

Samayam Telugu 27 Nov 2019, 4:25 pm
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం అమరావతిలో జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో.. కొత్త పథకాలతో పాటూ కీలక అంశాలపై చర్చించారు. కాపుల కోసం కొత్త పథకం, టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు, కొత్త రేషన్ కార్డులు, వైఎస్సార్‌ నవశకంతో పాటూ మరికొన్ని నిర్ణయాలకు తీసుకున్నారు. ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu cabinet.


*వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ.1101కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.

* కాపు నేస్తం పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేతకు ఆమోదం తెలిపారు.

* జగనన్న వసతి దీవెన కింద రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400కోట్లు కేటాయింపు.

* 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి వసతి దీవెన పథకం వర్తిస్తుందని వివరించారు.

*టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంచుతూ నిర్ణయం.

* కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం.

* నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

* కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్.

* ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఓకే.

* ఏపీఎస్‌పీడీసీఎల్‌ను విభజించి సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.