యాప్నగరం

AP Capitalపై నేడే నిర్ణయం.. అటు వైపే మొగ్గు?

అందరి చూపు ఏపీ కేబినెట్ సమావేశంవైపు.. మంత్రివర్గ సమావేశంలో రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ. మూడు రాజధానులకు మొగ్గు చూపుతారా.. అమరావతిలోనే కొనసాగిస్తారా..!

Samayam Telugu 27 Dec 2019, 8:32 am
ఏపీ రాజధాని ఎక్కడ.. అమరావతిలోనే కొనసాగుతుందా.. సీఎం జగన్ చెప్పినట్లు మూడు రాజధానలు ఉండబోతున్నాయా.. ఇవాళే రాజధాని భవితవ్యం తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. రాజధానితో పాటూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చనే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం భేటీ కాబోతోంది.
Samayam Telugu caibnet


Read Also: YSRCP ఎమ్మెల్యే అమరావతి రైతుల సెగ.. ఆయన ఇంటికెళ్లి మరీ..

కేబినెట్‌లో రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠరేపుతోంది. మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతారా.. లేక అమరావతిని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే అమరావతి రైతులు కూడా ఆందోళనల్ని ఉధృతం చేస్తుండటంతో.. దీన్ని ఎలా డీల్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మూడు రాజధానుల నిర్ణయానికి మొగ్గు చూపితే.. అమరావతి ప్రాంత రైతులకు ఎలా నచ్చచెబుతారన్నది ఆసక్తిరేపుతోంది.

ఇక మూడు రాజధానుల అంశం పక్కన పెడితే జగన్ సర్కార్ విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలింపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇక్కడ తేలాల్సింది కర్నూలుకు హైకోర్టు.. అమరావతి భవితవ్యం.. ఈ రెండు అంశాలు కూడా కీలకం కావడంతో.. అందరి చూపు కేబినెట్ సమావేశంపైనే ఉంది. ఇటు ఏపీ కేబినెట్ సమావేశం ఉండటం.. అమరావతి రైతుల ఆందోళనలతో భద్రతను పెంచారు. రాజధాని గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఏపీ కేబినెట్‌ను తరలించొద్దంటూ అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. రాజధాని ప్రాంత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత భగ్గుమన్నారు. గురువారం రాత్రి కూడా నిరసనలు తెలిపారు. ఇక కేబినెట్ నిర్ణయాన్ని బట్టి ఆందోళనలపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. శుక్రవారం కూడా తమ నిరసనల్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఉదయం నుంచి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి కేబినెట్ రాజధాని భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.