యాప్నగరం

ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ.. సీఎస్ కీలక ఆదేశాలు

ఈ నెల 13 సాయంత్రం 5 గంటల్లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. కేబినెట్‌ భేటీలో పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నియంత్రణా చర్యలపై చర్చించనున్నారు.

Samayam Telugu 11 Jul 2020, 6:56 am
ఆంధప్రదేశ్ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 15న మంత్రి మండలి భేటీకానుంది. వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం జరిగే కేబినెట్‌ భేటీలో పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నియంత్రణా చర్యలపై చర్చించనున్నారు. ఈ నెల 13 సాయంత్రం 5 గంటల్లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
Samayam Telugu ఏపీ కేబినెట్


గత నెల 11న కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పలు పథకాలకు ఆమోదం తెలిపారు.. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్చించారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్‌కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందజేయగా.. కేబినెట్‌లో చర్చించారు. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.