యాప్నగరం

రైతులు, డ్వాక్రా మహిళలకు శుభవార్త.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

వివిధ పథకాల కింద ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నగదు నేరుగా వారికే చేరాలి. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బును మినహాయించకోకూడదని సీఎం జగన్‌ బ్యాంకర్లకు సూచించారు. సున్నావడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో జాబితాలు అందజేయాలన్నారు.

Samayam Telugu 25 Sep 2019, 5:00 pm
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తామని జగన్ ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా బుధవారం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకు అధికారులకు ఆదేశాలిచ్చారు. రైతులు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
Samayam Telugu jagan 2


ఆర్థిక శాఖ అధికారులకు బ్యాంకర్లు అందుబాటులో ఉండాలని, వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికే చెల్లిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వడ్డీ డబ్బులు చెల్లించాక గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సున్నా వడ్డీ చెల్లింపుల రశీదు అందజేస్తారన్నారు. సున్నావడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో జాబితాలు ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు.

Must Read: నా కోరిక తీర్చమని చెప్పు.. గ్రామ వాలంటీర్ లైంగిక వేధింపులు: వివాహిత ఆత్మహత్య

అలాగే ముద్ర పథకం కింద రుణాల పంపిణీని విస్తృతం చేయాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూచించారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లు, చిరువ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. చిరువ్యాపారులు ప్రోత్సాహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం పథకాల అమలుకు బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని సీఎం జగన్ అన్నారు. సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరిస్తామని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు.

Also Read:బోటు ప్రమాదం: చివరిచూపు దక్కకపోయినా.. రమ్మశ్రీకి కర్మకాండలు

వివిధ వర్గాల ప్రజలకు చేయూతనిచ్చేందుకు, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం జగన్ అన్నారు. అందులో భాగంగా వివిధ పథకాల కింద ప్రభుత్వం లబ్ధిదారులకు నగదు జమ చేస్తుందన్నారు. ఆ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించకోకూడదని సీఎం జగన్‌ సూచించారు. అవసరమైతే నగదు మినహాయించుకునేందుకు వీల్లేకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.