యాప్నగరం

తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే.. ఏపీ సీ'ఐ'డీ

సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వైరల్‌ అవుతున్న సమాచారం నిజమా.. కాదా తెలుసుకునేందుకు ఆ వివరాలను వాట్సాప్‌ చేస్తే పోలీసుశాఖ నుంచి సమాధానం ఇస్తారు. అలాగే ఎవరైనా అసభ్యకర వ్యాఖ్యలు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడే వారిపై కూడా ఈ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

Samayam Telugu 16 Apr 2020, 7:27 am
కరోనా విషయంలో సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారానికి బ్రేకులు వేస్తున్నారు ఏపీ పోలీసులు. సోషల్ మీడియాలో అబద్దపు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబరు 90716 66667ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రారంభించారు. ఆన్‌లైన్‌ వీడియో ద్వారా బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్‌ సిద్ధార్థ, అడవి శేషు, సామాజిక కార్యకర్త కొండవీటి సత్యవతిలు ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ అయ్యారు.
Samayam Telugu andhra pradesh cid launches fact check whatsapp number
తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే.. ఏపీ సీ'ఐ'డీ


సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వైరల్‌ అవుతున్న సమాచారం నిజమా.. కాదా తెలుసుకునేందుకు ఆ వివరాలను వాట్సాప్‌ చేస్తే పోలీసుశాఖ నుంచి సమాధానం ఇస్తారు. అలాగే ఎవరైనా అసభ్యకర వ్యాఖ్యలు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడే వారిపై కూడా ఈ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లాక్‌డౌన్‌ సమయంలో మహిళా బాధితులకు అండగా ఉంటామంటున్నారు పోలీసులు. నిజాలను ప్రచారం చేసి ప్రజలకు భరోసా కల్పిస్తామని.. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆలస్యమైనా శిక్ష తప్పకుండా పడుతుందంటున్నారు.

అంతేకాదు ఎవరైనా ప్రభుత్వం, ప్రభుత్వ బాధ్యతల్ని చూసేవారిని కించపరిచేలా, వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే ఐపీసీ సెక్షన్-124ఏ కింద నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. మూడేళ్లు నుంచి జీవిత ఖైదు, జరిమానా విధించే అవకాశం ఉంది. ఆధారాలు లేకుండా అబద్దాలను పోస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటారు. వ్యక్తులు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, కించపర్చేలా పోస్టులు, ఫోటోలు పెడితే ఐపీసీ సెక్షన్ 505 కింద నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

కరోనా వైరస్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం, పోస్టింగ్‌లు ప్రచారం చేస్తే.. ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల ఆంక్షలను ఉల్లంఘించే చర్యలపై అంటువ్యాధుల చట్టం–54 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో సోషల్‌ మీడియాపై సీఐడీ ప్రత్యేక బృందంతో నిరంతర నిఘా పెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.