యాప్నగరం

తన శాఖను మరో మంత్రికి అప్పగించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన దగ్గర ఉన్న శాఖను మంత్రి మేకపాటికి అప్పగించారు. తన దగ్గర ఉన్న కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు.

Samayam Telugu 1 May 2020, 6:44 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన దగ్గర ఉన్న శాఖను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అప్పగించారు. కీలకమైన పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమ్‌రెడ్డి ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర శాఖలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేకపాటికి మరో శాఖ బాధ్యతలు కూడా బదిలీ చేశారు.
Samayam Telugu సీఎం జగన్


గతంలో కూడా శాఖల విషయంలో చిన్న మార్పులు జరిగాయి. మంత్రులు మేకపాటి, మోపిదేవి శాఖల్లో మార్పులు జరిగాయి. మోపిదేవి మార్కెటింగ్‌ శాఖను, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆహారశుద్ధి విభాగాన్ని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం ఈ మార్పులు చేర్పులు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మేకపాటి గౌతమ్‌రెడ్డి యువకుడు కావడంతో సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.

గౌతమ్‌రెడ్డి మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు 2014లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి గెలుపొందగా.. కేబినెట్‌లో సీఎం జగన్ అవకాశం కల్పించారు. అది కూడా కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను అప్పగించారు. ఆ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో తాజాగా పెట్టుబడులు, మౌలిక వసతులశాఖను అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.