యాప్నగరం

హుటాహుటిన ఢిల్లీకి జగన్.. రెండు గంటల ముందుగానే, కారణం ఇదే!

సాయంత్రం నాలుగు గంటల లోపే సీఎం ఢిల్లీకి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్న ఆయన.. ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu 22 Sep 2020, 1:20 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి షెడ్యూల్ కంటే ముందే ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేంద్రమంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. సాయంత్రం నాలుగు గంటల లోపే సీఎం ఢిల్లీకి చేరుకోనున్నారు. అందుకే హుటా హుటిన ఢిల్లీకి బయల్దేరారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ ముందుగా ఖరారు కావడంతో అనుకున్న సమయం కంటే ముందే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు.
Samayam Telugu సీఎం జగన్


జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారని సమాచారం. నిజానికి బుధవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్న ఆయన.. ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలను కలవాలని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వారి అపాయింట్‌మెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కోరినట్లు సమాచారం. వారిలో అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.