యాప్నగరం

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. చివరి నిమిషంలో ఉన్నట్టుండి!

షెడ్యూల్ మొత్తం ఖరారైపోయింది.. విమానం ఎక్కేందుకు సిద్దమవుతున్న సమయంలో ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. త్వరలోనే మళ్లీ అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే హస్తినకు వెళతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Samayam Telugu 2 Jun 2020, 11:15 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. హస్తినకు బయల్దేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆగిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా సమావేశాలతో బిజీగా ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే హస్తినకు వెళతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Samayam Telugu సీఎం జగన్


వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ 10.30కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అక్కడ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌, కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ ఖరారైంది. రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.