యాప్నగరం

జగన్ కళ్లజోడు అదిరింది.. సీఎం కొత్త లుక్

గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో సరదాగా కళ్లుజోడు తీసుకొని పెట్టుకున్న జగన్. కళ్లజోడు బావుంది అంటూ సీఎం కితాబు.

Samayam Telugu 8 Nov 2019, 8:52 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త లుక్‌లో అదరగొట్టారు. గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం.. వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఓ కళ్లజోడు తీసి జగన్‌కు ఇచ్చారు. ఆ కళ్ల జోడు పెట్టుకున్న జగన్ బావుంది అంటూ చిరునవ్వు చిందించారు. దీంతో పక్కనే ఉన్న కలెక్టర్, అధికారుల మొహాల్లో నవ్వుల పువ్వులు పూశాయి.
Samayam Telugu cm


గురువారం గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని బాధితులకు చెక్కులు అందించారు. రూ.10వేలులోపు డిపాజిటర్లకు చెక్కులు ఇచ్చారు.. త్వరలోనే రూ.20వేలలోపు వారికి ఇవ్వనున్నారు. అంతకముందు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అదే సమయంలో కళ్లజోడు పెట్టుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.