యాప్నగరం

సీఎం జగన్‌ వ్యక్తిగత సహాయకుడు మృతి

సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ మరణం. ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొని హుటాహుటిన అనంతపురం జిల్లాకు జగన్. బాధిత కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి పరామర్శ.

Samayam Telugu 6 Dec 2019, 3:42 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. నారాయణ మరణవార్త గురించి తెలియగానే సీఎం జగన్.. ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని తిరిగి ఏపీకి బయల్దేరారు.
Samayam Telugu narayna.


ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి నారాయణ స్వగ్రామం అయిన అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకున్నారు. నారాయణకు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి బయల్దేరి తాడేపల్లి చేరుకుంటారు.

నారాయణకు వైఎస్సార్‌ కుటుంబంతో మూడు దశాబ్ధాలకు పైగా అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి జగన్‌కు కూడా ఆయనే వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్నారు. కొద్దిరోజులుగా నారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో పాటూ కేంద్రమంత్రుల్ని కూడా కలవాల్సి ఉంది. కొంతమంది అపాయింట్‌మెంట్ కూడా ఖరారయ్యింది. కానీ తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ మరణం గురించి తెలియగానే వెంటనే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని తిరుగు పయనం అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.