యాప్నగరం

తండ్రి వైఎస్ బాటలో జగన్.. మరో రెండు నెలల్లో..

ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పథకాల అమలుతో పాటూ కీలక అంశాలపై చర్చ.. అధికారులకు కొన్ని సూచనలు చేసిన సీఎం. మరో రెండు నెలల్లో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తానన్న జగన్.

Samayam Telugu 22 Nov 2019, 3:28 pm
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ నవతర్నాలు, కొత్త పథకాలపై ఫోకస్ పెట్టారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అలాగే ఆర్థిక లోటు.. అనవసర ఖర్చును తగ్గించడంపై సీఎం ఫోకస్ పెట్టారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న వివిధ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ హామీలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో కీలక అంశాలపై చర్చించారు.
Samayam Telugu ys jagan.


గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టిందని.. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంపై దృష్టి పెట్టామని తెలిపారు. అనవసరమైన ఖర్చులు తగ్గించడంపై అధికారులు ఫోకస్ పెట్టాలని.. ప్రాధాన్యత అంశాలపై దృష్టిపెట్టి ముందుకెళ్లాలని సూచించారు. ప్రాధాన్యత అంశాలపై దృష్టిపెట్టి నడవాలని.. నవరత్నాల అమలే ప్రభుత్వానికి ఉన్న ఫోకస్ అన్నారు.

ప్రతి ఒక్క అధికారి దగ్గర మేనిఫెస్టో ఉండాలన్నారు ముఖ్యమంత్రి. మేనిఫేస్టో ఏసీ గదుల్లో తయారు చేసింది కాదని.. ప్రజల కష్టాలను చూసి చేసిందన్నారు. ఢిల్లీలో ఉన్న అధికారుల్ని ఉపయోగించుకోవాలని.. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి పథకాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని.. నిధుల్ని అక్కడ కొంత, ఇక్కడ కొంత ఖర్చు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఓ ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేయాలన్నారు. సీఎం ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుతమిచ్చే హామీనే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇచ్చే హామీల అమలుపై దృష్టిపెట్టాలని సూచించారు.

అలాగే జనవరి- ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై హామీలు ఇస్తామని.. ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలన్నారు. శంకుస్థాపన జరిగిన నాలుగు వారాల్లో పనులు ప్రారంభంకావాలని.. మాట ఇస్తే కచ్చితంగా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటను నెరవేర్చలేదనే విమర్శలు రాకూడదని.. వచ్చే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలి అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చినప్పుడే మళ్లీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తారన్నారు. మేనిఫెస్టోను అమలు చేయగలిగితే.. ప్రజలకు మేలు చేసినట్టేనని అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.