యాప్నగరం

ఏపీకి గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన కరోనా కేసులు, మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పడిపోయాయి. కరోనా మరణాలు 2 నమోదయ్యాయి.

Samayam Telugu 17 Dec 2020, 4:29 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పడిపోయాయి. అలాగే కరోనా మరణాలు సైతం అత్యల్ప స్థాయికి తగ్గాయి. అయితే డిశ్చార్జిల సంఖ్య భారీగా పెరిగాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 64,099 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 478 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,76,814కి చేరింది.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona hospital


అలాగే కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. బుధవారం కరోనా మహమ్మారి బారిన పడి ముగ్గురు మరణించారు. విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, వైఎస్సార్ కడపలో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,067కు చేరింది.
Pawan Kalyan డేరింగ్ స్టెప్: బీజేపీకి షాక్.. తిరుపతి ఉప ఎన్నికలో అదిరిపోయే ట్విస్ట్!
అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం 715 మంది కోవిడ్‌ 19 బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,65,327 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,420కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,10,01,476 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.