యాప్నగరం

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఒకరు మృతి

ఏపీలో కరోనా వైరస్ కేసులు శనివారం 129 నమోదయ్యాయి. అలాగే ఒకరు కరోనా బారినపడి మరణించారు.

Samayam Telugu 30 Jan 2021, 7:30 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు స్వల్పంగా తగ్గించినా కూడా కేసుల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. అలాగే మళ్లీ ఒక కరోనా మరణం నమోదైంది. శుక్రవారం కరోనా మరణాలు సున్నాకు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 41,003 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 129 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,87,720కి చేరింది.
Samayam Telugu కరోనా కేసులు
corona ward


ఇక, రాష్ట్రంలో మళ్లీ ఒక కరోనా మరణం సంభవించింది. ఆదివారం కరోనా బారిన పడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,153కి పెరిగింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పడిపోయాయి. కరోనా మహమ్మారి బారి నుంచి శనివారం మొత్తం 147 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,79,278 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,287కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,30,95,962 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, శనివారం కృష్ణా జిల్లాలో అత్యధికంగా 26 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఒక్కో కేసు నమోదైంది. అలాగే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 20 ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.