యాప్నగరం

ఏపీకి శుభవార్త: భారీగా పడిపోయిన కరోనా మరణాలు.. ఆ 2 జిల్లాల్లో అత్యల్ప కేసులు!

ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అయితే కరోనా బారినపడి ఒక్కరు మరణించారు.

Samayam Telugu 23 Jan 2021, 5:41 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.అయితే కరోనా మరణాలు మాత్రం భారీగా పడిపోయాయి. ఈసారి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గించినా, కేసుల్లో మాత్రం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 43,770 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 158 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,86,852కి చేరింది.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona hospital


ఇక, రాష్ట్రంలో మళ్లీ కరోనా మరణాలు మళ్లీ అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శనివారం విశాఖపట్నంలో ఒకరు కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,147కి చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కరోనా మహమ్మారి బారి నుంచి శనివారం మొత్తం 172 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,78,232 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,473కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,31,731 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, శనివారం తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 35 కరోనా కేసులు నమోదు కాగా.. నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 35 ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.