యాప్నగరం

ఏపీలో ఎనిమిదికి చేరిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

లండన్‌ నుంచి తిరుపతి వచ్చిన విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడికి తిరుపతిలో వైద్యం అందిస్తున్నారు. త్వరలో కడప, విశాఖలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు.

Samayam Telugu 24 Mar 2020, 8:49 pm
ఏపీలో కరోనా వైరస్ కేసులు ఎనిమిదికి చేరాయి. తాజాగా తిరుపతిలో మరో కేసు నమోదైంది. లండన్‌ నుంచి తిరుపతి వచ్చిన విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడికి తిరుపతిలో వైద్యం అందిస్తున్నారు. ఇక మక్కా నుంచి విశాఖ వచ్చిన వ్యక్తి కుమార్తె శాంపిల్స్‌లో నెగెటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అనంతపురం బోధనాస్పత్రిలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభమయ్యాయని.. త్వరలో కడప, విశాఖలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
Samayam Telugu ap


కరోనా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని సూచించారు. విదేశాల నుంచి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు జారీ చేశామని.. ఎవరైనా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే 'ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపీసీ సెక్షన్ 188' ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టామన్నారు.

వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నెంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌ను సంప్రదించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని.. బయటికి వెళ్లకూడదని.. కుటుంబ సభ్యులతోగానీ, ఇతరులతో గానీ కలవకూడదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.