యాప్నగరం

ఏపీకి శుభవార్త: అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పడిపోయాయి. అలాగే ఆదివారం కరోనా మరణాలు 14 నమోదయ్యాయి.

Samayam Telugu 15 Nov 2020, 6:21 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కరోనా కేసుల విజృంభణ మొదలైనప్పటి నుంచి మొట్టమొదటి సారిగా అత్యల్ప స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గించడం వల్లే ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంలో ఏపీలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఆదివారం మాత్రం కేవలం వెయ్యి కేసులు వచ్చాయి. ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 53,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,056 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,54,011కి చేరింది.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona hospital


అలాగే కరోనా మరణాలు ఆదివారం ఒక్కసారిగా పెరిగాయి. శనివారం ఏడు నమోదైన కరోనా మరణాలు ఆదివారం 14 సంభవించాయి. అనంతపురం జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,868కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 2,140 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,28,484 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 18,659 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 91,54,263 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.