యాప్నగరం

ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పడిపోయాయి. ఆదివారం కరోనా మరణాలు 11 నమోదయ్యాయి.

Samayam Telugu 22 Nov 2020, 5:44 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పడిపోయాయి. అయితే కరోనా మరణాలు మళ్లీ పెరిగాయి. ఆదివారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గి కరోనా మరణాలు పెరిగాయి. ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 71,913 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,121 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,62,213కి చేరింది.
Samayam Telugu కరోనా పరీక్షలు


అలాగే కరోనా మరణాలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం కరోనా మహమ్మారి బారిన పడి 11 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కపడలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,938కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు స్వల్పంగా పడిపోయాయి. ఆదివారం 1,631 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,41,026 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 14,249 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 96,15,090 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.