యాప్నగరం

ఏపీకి శుభవార్త: భారీగా పడిపోయిన కరోనా కేసులు, మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పడిపోయాయి. శుక్రవారం కరోనా మరణాలు 6 నమోదయ్యాయి.

Samayam Telugu 27 Nov 2020, 6:56 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా పడిపోయాయి. గురువారం కాస్త పెరిగిన కరోనా కేసులు శుక్రవారం మళ్లీ తగ్గాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించినా, కేసులు మాత్రం అత్యల్ప స్థాయికి పోడిపోయాయి. అలాగే కరోనా మరణాలు సైతం కనిష్టస్థాయికి పడిపోయాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 57,752 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 733 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,66,438కి చేరింది.
Samayam Telugu కరోనా పరీక్షలు


అలాగే కరోనా మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. శుక్రవారం కరోనా మహమ్మారి బారిన పడి ఆరుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,976కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు స్వల్పంగా పడిపోయాయి. శుక్రవారం 1,205 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,47,325 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 12,137 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 99,13,068 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.