యాప్నగరం

ఏపీ ప్రజలకు శుభవార్త.. భారీగా పడిపోయిన కరోనా కేసులు, మరణాలు

AP Corona Cases Today: ఏపీకి లో కరోనా వైరస్ మళ్లీ భారీగా పడిపోయాయి. అలాగే కరోనా మరణాలు 28 నమోదయ్యాయి.

Samayam Telugu 14 Oct 2020, 6:50 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు బుధవారం భారీగా పడిపోయాయి. కరోనా మరణాలు కూడా ఇటీవలి కాలంలో అత్యంత తక్కువగా నమోదయ్యాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 69,463 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,67,465కు చేరుకున్నాయి.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona hospital


అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. మంగళవారం కరోనా బారినపడి 35 మంది మరణించగా, బుధవారం ఆ సంఖ్య 28కి పడిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,319కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, శ్రీకాకులంలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాత పడ్డారు.

అలాగే డిశ్చార్జిలు మాత్రం రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిపోయాయి. బుధవారం 5,050 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,67,465 పాజిటివ్ కేసులకు గాను, 7,19,477 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 41,669 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు యథావిధిగా పెరిగిపోతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.