యాప్నగరం

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, నలుగురు మృతి

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కరోనా మరణాలు 4 నమోదయ్యాయి.

Samayam Telugu 1 Dec 2020, 6:15 pm
ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు కూడా అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. డిశ్చార్జిల సంఖ్య కూడా పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు పడిపోయింది. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 51,854 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 685 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,68,749కి చేరింది.
Samayam Telugu కరోనా వార్డు
corona ward


అలాగే కరోనా మరణాలు కూడా అత్యల్పస్థాయికి పడిపోయాయి. మంగళవారం కరోనా మహమ్మారి బారిన పడి నలుగురు మరణించారు. అనంతపురం జిల్లాలో ఒకరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,996కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 1,094 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,54,326 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 7,427కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,01,09,708 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.