యాప్నగరం

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. పడిపోయిన మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోయాయి. మంగళవారం కరోనా మరణాలు 8 నమోదయ్యాయి.

Samayam Telugu 24 Nov 2020, 6:16 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. సోమవారం 500 నమోదైన కరోనా కేసులు మంగళవారం డబుల్ అయ్యాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గించడం వల్ల తగ్గిన కేసులు, మంగళవారం పెంచడంతో పెరిగాయి. అయితే కరోనా మరణాలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 65,101 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,085 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,63,843కి చేరింది.
Samayam Telugu కరోనా పరీక్షలు


అలాగే కరోనా మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. మంగళవారం కరోనా మహమ్మారి బారిన పడి 8 మంది మరణించారు. కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,956కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 1,447 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,43,863 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 13,024 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 97,27,321 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.