యాప్నగరం

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 19 మంది మృతి

ఏపీకి లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం కరోనా మరణాలు 19కి తగ్గాయి.

Samayam Telugu 27 Oct 2020, 6:06 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన కేసులు మంగళవారం ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం కరోనా పరీక్షలు తగ్గించడంతో భారీగా కేసులు తగ్గగా, బుధవారం పరీక్షలు పెంచడంతో పెరిగిపోయాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 74,757 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,901 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 8,11,825కు చేరుకున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona hospital


అలాగే రాష్ట్రంలో సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా కరోనా వైరస్ బారినపడి 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,625కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కడప జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూలులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాత పడ్డారు.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4,352 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,11,825 పాజిటివ్ కేసులకు గాను.. 7,77,900 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 27,300 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.