యాప్నగరం

ఆ ఫోటో తీసి పంపితే రూ.100.. ఏపీ సీఎస్ బంపరాఫర్

మన విజయవాడ పేరుతో వినూత్న కార్యక్రమం ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు అడుగులు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వినియోగించుకుండా చర్యలు. ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవన్న సీఎస్ సుబ్రహ్మణ్యం.

Samayam Telugu 4 Aug 2019, 7:55 pm
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది ఏపీ సర్కార్. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా చర్యలు మొదలు పెట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన విజయవాడ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంకలోని గీతానగర్‌లో అధికారులు మొక్కలు నాటి జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. భావి తరాలను కాపాడదామని ప్రతిజ్ఞ చేయించారు.
Samayam Telugu subbu


మన విజయవాడ నినాదంతో ప్లాస్టిక్‌‌ వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు సుబ్రహ్మణ్యం. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యవరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడితే చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ప్లాస్టిక్ గ్లాసులు, బాటిల్ వాడుతుంటే ఫొటో తీసి తనకు పంపితే రూ.100 ఇస్తామన్నారు సీఎస్. నగరంలో ఎవరైనా ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్స్ అమ్మినా, ఉపయోగించినా జరిమానా విధిస్తున్నామంటున్నారు అధికారులు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్‌పై పూర్తి నిషేదం అమలవుతుందన్నారు. మన ఊరు.. మన విజయవాడ అనే నినాదాన్ని అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.