యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా పెరుతుండటంతో ప్రజలకు పలు సూచనలు చేసింది.

Samayam Telugu 22 May 2020, 7:07 am
ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడతాయంటోంది వాతావరణశాఖ. ఈ నెల 28 వరకు ఏపీలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని.. ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దంటున్నారు అధికారులు
Samayam Telugu ఈ జాగ్రత్తలు తప్పనిసరి


ఇటు రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా పెరుతుండటంతో ప్రజలకు పలు సూచనలు చేసింది.

ఎండ వేడి ఎక్కువగా ఉంటే గొడుగు ఉపయోగించాలి. తెలుపురంగు కాటన్ వస్త్రాలను ధరించాలి.. తలకు టోపీ, రుమాలు పెట్టుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ నీరు తాగొచ్చు.. ఓరల్ రీ హైడ్రేషన్ తాగొచ్చు. వడదెబ్బకు గురైనవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చి తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. వడదెబ్బకు గురైన వారిలో మంచి మార్పులు లేకపోతే శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. మంచి నీరు ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు తాగాలి. ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని నీరు తాగాలి.
తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి ప్రాథమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా చూసుకోవాలి.

వడదెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు. మధ్యాహ్నం తర్వాత ఆరు బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయొద్దు. ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధాలు, తేనె తీసుకోకూడదు. శీతలపానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.