యాప్నగరం

YS Jagan కు బిగ్ షాక్: ఏకమైన నాయకులు.. ఏపీ ఉద్యోగుల సంచలన ప్రకటన!

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంపై ఉద్యోగ సంఘాల నాయకులు కీలక ప్రకటన చేశారు.

Samayam Telugu 28 Nov 2021, 5:18 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో అమరావతి జేఏసీ, ఏపీఎన్జీవో భవన్‌లో ఎన్జీవో జేఏసీ కార్యవర్గ సభ్యులు విడివిడిగా భేటీ అయ్యారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్లతో పాటు వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పీఆర్సీపై ఏపీ జేఏసీ నేతలు ఇప్పటికే విధించిన డెడ్‌లైన్ ముగిసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
Samayam Telugu సీఎం జగన్


ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.1600 కోట్లుపై చర్చించామని.. జేఏసీ తరఫున కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 94 ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.


సీఎం జగన్‌కు సూటి ప్రశ్న!
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా ఆర్థిక మంత్రి చర్చించారా? అని ప్రశ్నించారు. పేదల కోసం పని చేసే ఉద్యోగుల పట్ల మంత్రి కించపరిచేలా మాట్లాడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు. నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ ప్రకటన చేస్తే ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని బొప్పరాజు ప్రకటించారు. ఇక, ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని బొప్పరాజు చెప్పారు. వెంకట్రామిరెడ్డి అనుభవ రాహిత్యంతో ప్రకటనలు ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించిన డీఏలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగుల కార్యాచరణపై మరో కీలకమైన ప్రకటన చేయబోతున్నట్లు బొప్పరాజు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.