AP EX DGP Prasad Rao Death: మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత.. అమెరికాలో
AP EX DGP Prasad Rao Died: తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్న ప్రసాద్రావును కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం.
Samayam Telugu 10 May 2021, 11:20 am
ప్రధానాంశాలు:
- మాజీ డీజీపీ ప్రసాద్రావు కన్నుమూత
- ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిక
- అమెరికాలోనే కన్నుమూత
AP DGP Prasada Rao: మాజీ డీజీపీ ప్రసాద్రావు గుండెపోటుతో అమెరికాలో కన్నుమూశారు. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్న ప్రసాద్రావును కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అర్ధరాత్రి 1 గంటకు అమెరికాలో తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రసాద్రావు గతంలో ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రసాద్రావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాద్రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ డీజీపీ ప్రసాద్రావు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రసాద్రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.