యాప్నగరం

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త.. క్రిస్మస్ కానుక ముందే ఇచ్చేసిన జగన్ సర్కార్!

ఏపీలో పెన్షనర్లకు జగన్ సర్కారు బుధవారం శుభవార్త చెప్పింది. 2019 జూలై 1వ తేదీ నుంచి డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు.

Samayam Telugu 22 Dec 2021, 9:25 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ అలవెన్సెస్ (డీఏ)ను విడుదల చేసింది. 2019 జులై 1 నుంచి ఈ మేరకు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ బేసిక్‌పై 3.144 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Samayam Telugu ఏపీలో పెన్షనర్లకు శుభవార్త


కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 2022 కొత్త సంవత్సర వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

2019 జులై 1వ తేదీ నుంచి ఈ డీఏ వర్తిస్తుందని వెల్లడించింది. ఒక్కో ఉద్యోగికి 5.24 శాతం డీఏ చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పెరిగిన డీఏను జనవరి జీతంతో పాలు ఉద్యోగులు తీసుకోనున్నారు. ఉద్యోగుల తరహాలోనే పెన్షనర్లకు సైతం డీఏ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.