యాప్నగరం

ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త: ఈ నెల 18 నుంచి అందరికీ ఉచితంగా..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం ఆదేశాలతో ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో ఒక్కొక్కరికీ ఉచితంగా..!

Samayam Telugu 16 Jan 2022, 11:33 am
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 18వ తేదీ నుంచి ప్రజలందరికీ ఉచిత రేషన్ బియ్యం అందించనున్నట్లు ప్రకటించింది. కుటుంబంలో ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున అందజేయనున్నట్లు వెల్లడించింది. గత నెలలో సరిపడా నిల్వలు లేనందున.. ఈ నెలలో రెండు నెలలకు కలిపి ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు.
Samayam Telugu ప్రధాని మోదీతో సీఎం జగన్


ఈ పథకం గతేడాది డిసెంబర్ నెలతోనే ముగియగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్చి వరకు పొడిగించిందని గిరిజా శంకర్ గుర్తు చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత బియ్యం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గిరిజా శంకర్ సూచించారు.

Andhra ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త.. మార్చి వరకు ఉచితంగా..!
కాగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏపీలోని లబ్ధిదారులందరికీ ఈ ఏడాది మార్చి నెల వరకు ఒక్కొక్కరికి ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2021 డిసెంబర్ నుంచి లబ్ధిదారులకు ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సిందిగా ఏపీ పౌరసరఫరాల శాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. అయితే, డిసెంబర్‌లో స్టాక్ లేనందు వల్ల ప్రజలకు బియ్యం ఇవ్వలేదని, ఈ నెల 18న ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున పంచుతామని గిరిజా శంకర్ వెల్లడించారు. దీంతో పేద ప్రజలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా మరింత ప్రయోజనం చేకూరనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.