యాప్నగరం

ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. ఇసుక విధానంలో మార్పులు, ఇక ఆ నిబంధనలు లేవు

అక్కడక్కడా నాణ్యత లేని ఇసుకను సరఫరా చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు వినియోగదారుడే నేరుగా ఇసుక స్టాక్ పాయింట్లకు వెళ్లి ఇసుకను తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

Samayam Telugu 19 Aug 2020, 7:18 am
ఇసుకకు సంబంధించి ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించే పనిలో ఉంది జగన్ సర్కార్. రాష్ట్రంలో అక్కడక్కడా నాణ్యత లేని ఇసుకను సరఫరా చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు వినియోగదారుడే నేరుగా ఇసుక స్టాక్ పాయింట్లకు వెళ్లి ఇసుకను తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇంటి దగ్గరకు సరఫరా చేసే విధానాన్ని తొలగించనున్నారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా మొదలుకానున్న ఇసుక కార్పొరేషన్‌లో ఈ నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నారు.
Samayam Telugu ఇసుక విధానం


నిర్మాణాలు, ప్లాస్టింగ్‌కు వేర్వేరు రకాల ఇసుక అవసరం అవుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇసుక కావాలని నమోదు చేసుకుంటే.. స్టాక్ పాయింట్ నుంచి ఏదో ఒక దానిని ఇంటికి పంపుతున్నారు. ఈ విషయంలో ఫిర్యాదు వస్తుండటంతో నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. 72 గంటల్లో ఇంటి దగ్గరకు సరఫరా కావాల్సి ఉండగా.. చాలాచోట్ల ఆలస్యమైంది. స్టాక్ పాయింట్ నుంచి దగ్గరలో ఉన్న ఇళ్లకు ఇసుకు తీసుకెళ్లేందుకు లారీ యజమానులు వెనకడుగు వేస్తున్నారు.

ఇలా సమస్యలు వెంటాడుతుండటంతో వినియోగదారుడే వాహనాన్ని తీసుకొచ్చి తనకు కావాల్సిన ఇసుకను తీసుకెళ్లే విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక కావాలని నమోదు చేసుకుంటే.. ఆ వ్యక్తికి నిజంగా ఇసుక అవసరం ఉందా.. లేదా అనేది పరిశీలించనున్నారు. ఆ తర్వాతే ఇసుక సరఫరాకు అనుమతిస్తారు. దీనిపై అధికారులు కసరత్తు చేసి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.