యాప్నగరం

ఏపీలో మందుబాబులకు మరో షాక్.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీలో మద్యం ప్రియులకు షాకిచ్చిన ప్రభుత్వం.. మద్యపాన నిషేధం దిశగా అడుగులు. మంగళవారం మరో 50శాతం మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలు మూసేసే అవకాశం.

Samayam Telugu 5 May 2020, 11:02 am
ఏపీలో మరోసారి భారీగా మద్యం ధరలు పెరిగాయి. మంగళవారం మరో 50శాతం మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే 25శాతం ధరలు పెంచగా.. నిన్నటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచింది. మొత్తంగా మద్యంపై 75శాతం ధరలు పెరిగినట్లు అయ్యింది. ఇవాళ్టి నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయి.. మధ్యాహ్నం 12 గంటలకు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలు మూసేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
Samayam Telugu ఏపీలో మద్యం అమ్మకాలు


ఏపీలో మద్యం అమ్మకాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. తొలిరోజు మందుబాబులు ఉత్సాహంగా ఉదయం నుంచే షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఎక్కువ జిల్లాల్లో తొలిరోజు స్టాక్ మొత్తం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. సోమవారం ఒక్క రోజే మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.50 కోట్లు వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 అధికారిక మద్యం షాపులకుగాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ‌గా 411 మద్యం షాపుల విక్ర‌యాలు ప్రారంభించాయి. రెండో రోజు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.. నాలుగైదు రోజులకు పరిస్థితి సద్దుమణుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదీకాక ధరలు భారీగా పెంచడంతో రద్దీ కూడా తగ్గుతుంది అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.